క్రైమ్/లీగల్

ఎకేబీఆర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 29: మండలంలోని అక్కంపల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తికి మూర్చ రావడంతో రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. బంధువులు, గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాలి ఉన్నాయి. మండలంలోని అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు కృష్ణయ్య (28) సోమవారం చేపలు పట్టేందుకు తెప్పపై రిజర్వాయర్‌లోకి వెళ్లాడు. మధ్యలోకి వెళ్లాక మూర్చరావడంతో అందులో పడిపోయాడు. సమీపంలో ఉన్న జాలర్లు గుర్తించి దగ్గరకు వెళ్లేలోపే మునిగి గల్లంతయ్యాడు. ఎంత వెతికినా వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. నాగార్జున సాగర్ నుండి గజ ఈతగాళ్ల ద్వారా వెతికించినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం సాయంత్రం పీ.ఏ.పల్లి పాత గ్రామం సమీపంలో ఒడ్డున మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన జాలర్లు గుర్తించి 100కు సమాచారం అందిచారు. మృతునికి భార్య కీర్తనతో పాటు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు.