క్రైమ్/లీగల్

బురదగుంటలో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, డిసెంబర్ 2: నాటుసారా తాగి పొలం గట్టుపై నడుస్తు బురదగుంటలో పడి ఓ గిరిజనుడు మృతిచెందిన సంఘటన ఇది. స్థానికులు, కురుపాం పోలీసులు అందించిన వివరాల ప్రకారం రస్తాకుంటుబాయి గ్రామానికి చెందిన మూటక రాఘవేంద్ర(30) నాటాసారాను తాగేందుకు శనివారం రాత్రి జొంగరపాడు వెళ్లాడు. తిరిగివస్తు పొలంగట్లుపై అదుపుతప్పి బురదగుంటలోపడి మృతి చెందాడు. ఈ విషయం ఆదివారం ఉదయం గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో కురుపాం ఎస్‌ఐ బాలాజీరావు వెళ్లి పరిశీలించి దర్యాప్తు నిర్వహించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. పలు గ్రామాల్లో నాటుసారాను విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. నాటుసారా విక్రయాల వలన పలువురు ఇటువంటి పరిస్థితులలో చనిపోతున్నారని, వెంటనే అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.