క్రైమ్/లీగల్
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 7 December 2018
తిరుపతి, డిసెంబర్ 6: తిరుపతి రూరల్ శెట్టిపల్లి పంచాయతీలోని బీటీఆర్ కాలనీలోని 11వ లైన్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూసింది. బీటీఆర్ కాలనీలో పురుషోత్తం (35) అతని భార్య పద్మావతి (30), కుమారుడు మనోజ్ (7), కుమార్తె వైష్ణవితో కలిసి జీవిస్తున్నాడు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో పురుషోత్తం పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పురుషోత్తం తన భార్య, ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే కుమార్తె వైష్ణవి కొన ఊపిరితో ఉన్న సమయంలో స్థానికులు గుర్తించి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి కుటుంబ కలహాలా లేక మరేమైనా కారాణాలున్నాయా అనే కోణంలో అలిపిరి పోలీసులు ఆరా తీస్తున్నారు.