క్రైమ్/లీగల్

14లోగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: తమ రథయాత్రకు అనుమతి కోరుతూ బీజేపీ చేసిన విజ్ఞప్తిపై సరైన రీతిలో స్పందించని పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై ఈనెల 14లోగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బీజేపీ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వ వౌనం ఆశ్చర్యం, దిగ్భ్రాంతిని కలిగించిందని జస్టిస్‌లు విశ్వనాథ్ సోమద్దర్, ముఖర్జీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీజేపీ నిర్వహించే రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులకు సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ చీఫ్ సెక్రటరీ, హోంసెక్రటరీ, డీజీపీ, ముగ్గురు బీజేపీ ప్రతినిధులతో ఈనెల 12న సమావేశం నిర్వహించాలని, రథయాత్ర అనుమతిపై డిసెంబర్ 14న నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.