క్రైమ్/లీగల్

మద్యం తాగి ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 7: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో ఓటు వేసేందుకు మద్యం తాగి వచ్చిన ఇద్దరిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్టు స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామంలోని ధానవత్ హరి అనే అతను మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి రాగా బ్రీత్ ఎనలైజర్ పెట్టామన్నారు. బ్రీత్ ఎనలైజర్ లో 378/100 మిల్లీలీటర్లు చూపడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా త్రిపురారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పోలింగ్ స్టేషన్‌లో ఒకరు మద్యం సేవించి ఓటు వేయడానికి రాగా అతనిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.