క్రైమ్/లీగల్
రైలు కింద పడి యువకుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గుత్తి, డిసెంబర్ 8 : గుత్తి రైల్వేస్టేషన్లో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి పట్టణానికి చెందిన నరేష్కుమార్ (28) మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురానికి చెందిన నరేష్కుమార్ హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శనివారం అనంతపురానికి ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో వస్తుండగా రైలు గుత్తిస్టేషన్కు రాగానే అక్కడ దిగాడు. తిరిగి కదులుతున్న రైలు ఎక్కబోతుండగా అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడ్డాడు. గమణించిన స్థానికులు ఆర్పీఎఫ్, జీఆర్పీ సాయంతో వైద్య చికిత్స నిమిత్తం తరలించేలోపు మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.