క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, డిసెంబర్ 8: వీరవాసరం మండలం నౌడూరు సెంటర్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్సై ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంకు చెందిన గోపిశెట్టి వివేకానంద (26), చింతలపూడి గ్రామానికి చెందిన బత్తినీడి దుర్గేష్ (24)లు బైక్‌పై నౌడూరు వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు అరెస్టు
నిడమర్రు, డిసెంబర్ 8: డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు గణపవరం ఎస్సై శివనారాయణ తెలిపారు. శనివారం తెల్లవారు జామున గణపవరం సెంటర్‌లో డ్రంకెన్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.