క్రైమ్/లీగల్
లోక్ అధాలత్లో 102 కేసుల పరిష్కారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 8 December 2018
అరకులోయ, డిసెంబర్ 8: స్థానిక ప్రధమ శ్రేణి జుడిషియల్ మండల మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అధాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు సత్వర న్యాయం కోసం జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అధాలత్ను నిర్వహించి 102 కేసులను పరిష్కరించారు. స్థానిక ప్రధమ శ్రేణి జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి ఎ.క్రిష్ణప్రసాద్ వంద ఎక్సైజ్ కేసులు, రెండు ఐ.పి.సి. కేసులను పరిష్కరించి 27 వేల నాలుగు వందల రూపాయల అపరాద రుసుంను వసూలు చేసారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎ.పి.పి. నరేష్, లోక్ అధాలత్ సభ్యులు మురళీమోహన్, రాంబాబు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.