క్రైమ్/లీగల్

బస్సు కింద పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, డిసెంబర్ 8: బస్సు కింద పడి ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... లంగర్‌హౌస్ అంబేద్కర్ నగర్‌కు చెందిన చంద్రయ్య కుమారుడు ఏ.ప్రవీణ్ (21) గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్‌లో పూల వ్యాపారి. పని నిమిత్తం శనివారం సాయంత్రం హైదర్షకోట్‌లో పని ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా లంగర్‌హౌస్ సంఘం బాపూఘాట్ వద్ద పక్కనుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుకచక్రాల కిందపడి తీవ్ర గాయా లై అక్కడికక్కడే దుర్మరణం చెందా డు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.