క్రైమ్/లీగల్

సెల్‌ఫోన్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, డిసెంబర్ 8: అక్కా, చెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ కోసం రాజుకున్న గొడవ చినికి చినికి పెద్దదై అక్క ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో విషాదాన్ని నింపింది. ఖండవల్లిలో రవళి స్పిన్నింగ్ మిల్లుకు చెందిన అపార్టుమెంట్‌లో నివసిస్తున్న పిక్కి భారతి (20) అనే అవివాహిత ఉరి వేసుకొని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిక్కి తాతాలుకు నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు భార్యతో కలిసి ఖండవల్లిలోని రవళి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అక్కడే ఉన్న పరిశ్రమకు చెందిన అపార్టుమెంట్ పోర్షన్‌లో నివసిస్తున్నారు. ఇటీవలే పరిశ్రమలో పని మానివేసిన ఈ కుటుంబం వేరే చోటకు వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. తల్లిదండ్రులు తాతాలు, రూపి దంపతులు ముందుగా హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమార్తెలు భారతి, రాణి శనివారం వెళ్లాసి ఉంది. ఇంతలో శనివారం ఉదయం అక్కా చెలెళ్లు సెల్‌ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఒకరినొకరు గోళ్లతో రక్కుకొని తిట్టుకున్నారు. మనస్తాపానికి గురైన భారతి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకొని చున్నీతో ఉరి వేసుకొంది. భయంతో చెల్లెలు కేకలు వేయడంతో పక్కఉ ఉన్నవారు వచ్చి బలవంతంగా తలుపులు తీయగా భారతి విగత జీవిగా పడి ఉంది. స్థానికుల సహకారంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భారతి మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సంఘటన విషయం తెలిసి హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులు తిరిగి ఇక్కడకు ప్రయాణమయ్యారు. పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రాలు..మృతి చెందిన భారతి *అధికారులతో మాట్లాడతున్న మృతురాలి చెల్లెలు రాణి