క్రైమ్/లీగల్

కట్నం వేధింపులకు వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, డిసెంబర్ 8: అత్తింటిలో వరకట్న వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మానకొండూర మండలం శ్రీనివాస్‌నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...శ్రీనివాస్‌నగర్ గ్రామానికి చెందిన ముద్దంగుల రమేశ్ అనే యువకుడికి ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన మంజుల (28) అనే యువతితో ఎదేళ్ల క్రితం 2లక్షల కట్నంతో పాటు లాంచనాలు ఇచ్చి వివాహం జరిపించారు. మంజులను అత్త కనకమ్మ, భర్త రమేశ్ గత కొన్ని నెలలుగా లక్ష రూపాయల అదనం కట్నం చేవాలంటూ వేధింపులకు గురిచేశారు. అత్తింటి వేధింపులకు మనస్థాపానికి గురై అక్టోబర్ 29న ఇంటిలో మంజుల ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మంజుల 40రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రమేశ్, అత్త కనకమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.