శ్రీకాకుళం

కడలిలో అలజడి.. ఇద్దరు యువకులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, డిసెంబర్ 9: మండలం కళింగపట్నం-మత్స్యలేశం (పోర్టుకళింగపట్నం) పంచాయితీ పరిధిలోని సాగరతీరంలో ఆదివారం సాయంత్రం అలజడి నెలకొంది. ఆదివారం కావడంతో ఎప్పటిమాదిరిగానే ఈ ప్రాంతానికి ఆహ్లాదానికై పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. ఈ క్రమంలోనే సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు సముద్ర కెరటాలకు చిక్కి గల్లంతైయ్యారు. సాధారణంగా కార్తీకమాసం అనంతరం వచ్చే ఒకటి..రెండు ఆదివారాలు కూడా మండలంలోని పలు సందర్శన ప్రాంతాలకు సందర్శనకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం పెద్ద ఎత్తున సందర్శకులు విచ్చేసారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరంకు చెందిన ముగ్గురు యువకులు వేర్వేరు సమయాల్లో సముద్ర స్నానానికి దిగి కెరటాలకు చిక్కి గల్లంతైనట్లు సమాచారం. శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు యువకులు సముద్ర కెరటాలకు చిక్కి ప్రాణరక్షణ కోసం కేకలు వేయగా స్థానికులు అప్రమత్తమై వారిని కాపాడే ప్రయత్నంలో ఒకరు క్షేమంగా బయట పడగా మరో యువకుడు బరాటం సాయి కెరటాలకు చిక్కి గల్లంతైయ్యాడు. అదేవిధంగా విజయనగరానికి చెందిన పంతులు గణేష్ కూడా గల్లంతైనట్లు సమాచారం.