క్రైమ్/లీగల్

రెండు బైకులు ఢీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, డిసెంబర్ 9: మండలంలోని సలబత్‌పూర్ గ్రామ శివారులోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం రాత్రి 8.30 గంటలకు రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హండెకల్లూర్ గ్రామానికి చెందిన సంజీవ్, సలబత్‌పూర్ గ్రామానికి చెందిన దశరత్, సూర్యకాంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తంపోతున్న ఈ ముగ్గుర్ని సలబత్‌పూర్ గ్రామస్తులు హుటాహటిన మద్నూర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరిలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఉండి కూడా వైద్యం సకాలంలో అందించక పోవడం, 108 అంబులెన్స్ కూడా లేక పోవడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ప్రైవేట్ వాహనాల్లో క్షతగాత్రులు ముగ్గుర్ని కూడా బాన్స్‌వాడ ఏరియా ఆసుపత్రికి తరిలించారు. క్షతగాత్రుల బందువులు, కుటుంబీకులు, గ్రామస్తులు కలిసి మద్నూర్ మండల కేంద్రంలోని పాతబస్‌స్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అంబులెన్స్ లేదు, వైద్య సౌకర్యం లేదు అంటూ నినాదాలు చేస్తు రాస్తారోకో చేపట్టారు. రాత్రి 9.30 గంటల వరకు కూడా ఇంకా రాస్తారోకో కొనసాగుతుంది. దీంతో జాతీయ రహదారిపై భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. స్థానిక ఎస్‌ఐ సాజిద్, ఎఎస్‌ఐ వెంకట్రామ్‌తో పాటు పోలీసు బలగాలు చేరుకుని ఆందోళనకారులను సముదాయిస్తున్నారు.