క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 December 2018
అశ్వారావుపేట, డిసెంబర్ 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నందిపాడు గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నందిపాడు గ్రామానికి చెందిన కుంజా జోగారావు(21), ఊకె కిషోర్కుమార్(23), కారం వీరభద్రం(22) దరిమిల ముక్తేశ్వరావు కలిసి కుడుములపాడు గ్రామం నుండి నందిపాడు గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. నందిపాడు గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. వీరభద్రం, జోగారావు, కిషోర్కుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా ముక్తేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై వి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.