అనంతపురం

భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, డిసెంబర్ 12: నిర్మాణంలో వున్న ఇంటిపై నుంచి పడి పనిచేస్తున్న కార్మికుడు శ్యాంసన్ (34) మరణించాడు. బుధవారం పట్టణంలోని పార్వతీనగర్‌లో ఇంటి నిర్మాణం కోసం పనిచేయడానికి పోయి శ్యాంసన్ రెండో భవనంపై నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే శ్యాంసన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఒంగోలు జిల్లా బల్లికురవ మండలం, అడ్డంకి గ్రామానికి చెందిన శ్యాంసన్ ఇంటి నిర్మాణంలో కార్మికుడిగా పనిచేయడానికి కళ్యాణదుర్గం వచ్చారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.