క్రైమ్/లీగల్

మరణంలోనూ వీడని స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 11: ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ మరణం కూడా తమ స్నేహాన్ని విడదీయలేదని ఇద్దరు స్నేహితులు తనువు చాలించి నిరూపించారు. నగర శివార్లలోని సుందరయ్య కాలనీకి చెందిన తుమ్మల సుబ్రహ్మణ్యం (22), చింతల సతీష్‌కుమార్ అలియాస్ చిన్ని (23) మంచి స్నేహితులు. నిత్యం కలిసి తిరుగుతూ ఒకరి కష్టాన్ని మరొకరు తమదిగా భావించే మనస్తత్వం కలిగినవారు. ఆదివారం ఉదయం వేదాయపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్‌పై వీరిద్దరు విగతజీవులుగా పడిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించి మృతుల కుటుంబీలకు అందచేశారు. తమ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు రైలు కింద పడి మరణించారనే విషయం తెలియడంతో సుందరయ్య కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతుల కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకొంది. మరణానికి కారణాలు తెలియలేదని, ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇద్దరు స్నేహితులు ఇటీవల వ్యాపారం ప్రారంభించారని, అందులో నష్టాలు రావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని స్థానికుల ద్వారా తెలిసింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.