క్రైమ్/లీగల్

నలుగురు యువకుల అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, డిసెంబర్ 21: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామం శుక్రవారం నాడు శోకసముద్రంలో మునిగిపోయింది. పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించడం గ్రామంలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనలో మరణించిన నలుగురు యువకులు అవివాహితులు కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషాద సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాదెగాని అరవింద్‌గౌడ్(23) హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా బొమ్మరాశిపేట గ్రామ శివారు ప్రాంతంలో ఒక కోళ్ల ఫారాన్ని లీజ్‌కు తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటాపురం గ్రామానికి చెందిన తన మిత్రులైన మోగుళ్ల సతీష్‌గౌడ్ (20), చెన్నబోయిన మహేష్‌ముదిరాజ్ (20) అనే మరో ఇద్దరు మిత్రులను తనతోపాటు కోళ్ల ఫారంలో పనిచేసేందుకు తీసుకెళ్లాడు. పొరెడ్డి మహేందర్‌రెడ్డి (25) అనే యువకుడు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌లాబ్‌లో పనిచేస్తూ ఈ ముగ్గురు మిత్రులతో కలసి ఉంటున్నాడు. గురువారం రాత్రి మృతులు నలుగురు కలసి సమీప గ్రామంలోని మరో ఇద్దరు యువకులను పనికి పిలిపించుకొని మొత్తం ఐదుగురు కలసి కోళ్లఫారంలోని కోడిపిల్లలకు రాత్రి ఒంటి గంట వరకు టీకాలు వేశారని గ్రామస్థుల ద్వారా తెలిసింది. అనంతరం అందరు కలసి చికెన్ వండుకొని భోజనం చేసి నిద్రించారు. శుక్రవారం ఉదయం కోళ్లఫారానికి వచ్చిన పనిమనుషులు యువకులు గదిలోనిర్జీవంగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా నలుగురూ పడుకున్న చోటనే నురగలు, రక్తం, వాంతులు చేసుకొని చనిపోయి కనిపించారు. వారు తిన్న ఆహారంలో ఏమైనా విష పదార్దాలు కలిశాయా? అని పోలీసులు అనుమానించారు. దీన్ని అనుమానాస్పదంతో మరణించారని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.