క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, డిసెంబర్ 23 : రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పాతపేటకు చెందిన జిలాన్ కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సమీప బంధువుల దిన కర్మకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. అయితే కారు గుత్తి మండల పరిధిలోని కరిడికొండ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో జిలాన్ బాషా భార్య ఫజులున్(28), కుమారుడు లియాన్‌వాహిద్(2) అక్కడికక్కడే మృతి చెందగా గుత్తి ప్రభుత్వాసుపత్రితో చికిత్స పొందుతూ జిలాన్‌బాషా మేనల్లుడు ఖాదీర్‌బాషా(10) మృతి చెందాడు. అలాగే జిలాన్‌బాషా, రిషాచష్మి, బాబిన్ తీవ్రంగా గాయపడ్డారు.

చిత్రం..రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న కారు