క్రైమ్/లీగల్

కార్పొరేటర్ భర్తపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్‌రెడ్డిపై కేసు
నమోదైందని సీఐ సుదర్శన్ తె లిపారు.
చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఓ స్థల వివాదంలో
ధీరజ్‌రెడ్డి అనుచరులు వెళ్లి
బాధితుడిని తీవ్రంగా బెదిరించి దూషించగా కేసు
నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 23: ఆర్‌కేపురం కార్పొరేటర్‌రాధ భర్త ధీరజ్‌రెడ్డిపై కేసు నమోదైన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చైతన్యపురి సీఐ సుదర్శన్ కథనం ప్రకారం... ఆర్‌కేపు రం రోడ్డు నెంబర్ 8లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన స్థలం లో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాడు. నిర్మాణం జరుగుతున్న స్థలం ప్రక్కన ఉన్న మరో వ్యక్తి ఈ స్థలం మాది అంటూ ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇంతలో కార్పొరేటర్ భర్త అతని అనుచరులు వెళ్లి బాధితుడు శ్రీనివాస్‌ను బెదిరించారు. శ్రీనివాస్ చైతన్యపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చైతన్యపురి పోలీసులు ఆర్‌కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డిపాటు వెంకటేష్, బాలు, రామకృష్ణ, కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.