క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో తోడల్ల్లుళ్లు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మక్తల్, డిసెంబర్ 23: మక్తల్లోని శ్రీపడమటి ఆంజనేయస్వామి బ్రహోత్సవాలలో భాగంగా పండుగ పూట ఎంతో సంతోషంతో, సంబరాలతో ఉండవలసిన ఆకుంటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులైన అక్కాచెల్లెళ్ల భర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మణం పొందిన సంఘటన ఆదివారం మక్తల్ పట్టణంలోని పెద్దచెరువు సమీపంలోని పెట్రోల్బంక్ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై అశోక్కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ పట్టణానికి చెందిన కల్లూరి చిన్న భీమయ్య అల్లుళ్లు అయిన ఊట్కూర్కి చెందిన పెద్ద అల్లుడు రమేష్, దాసర్పల్లికి చెందిన చిన్న అల్లుడు కొండయ్య ఇరువురు సైకిల్ మోటారుపై పొలం నుండి ఇంటికి వస్తూ మక్తల్ సమీపంలోని పెద్ద చెరువు పక్కనేగల పెట్రోల్బంక్ దగ్గర ఆర్టీసి బస్సును వెనుక నుండి ఢీకొట్టడంతో పెద్ద అల్లుడు రమేష్ (40), అక్కడికక్కడే మృతి చెందగా, మరో అల్లుడు కొండయ్య (36) కుడికాలు విరిగి, తలకు బలమైన గాయం కాడవంతో ఆయనను మహబూబ్నగర్లోని జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. రమేష్ అనే యువకుడు ఊట్కూర్లో చిన్నపాటి టీ కొట్టు పెట్టుకొని జీవనోపాది సాగిస్తుండగా ఆయనకు భార్య శ్రీలత, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. దాసర్పల్లికి చెందిన కొండయ్య అనే యువకుడు గతంలో వివిధ పత్రిక, టీవీచానళ్లలో, ప్రస్తుతం ప్రైమ్న్యూస్ చానల్లో పని చేస్తున్నారు.