క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, డిసెంబర్ 24: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జర్పుల నాగేశ్వరరావు(36) భద్రాచలం నుంచి ఏడూళ్ళబయ్యారం వెళ్తూ మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామం వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావును గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లడంతో అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏడూళ్ళబయ్యారం పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవలే భద్రాచలం బదిలీ అయ్యాడు. విధి నిర్వహణ ముగించుకొని ఏడూళ్ళబయ్యారం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలికి చేరుకున్న మణుగూరు సీఐ వై.రమేష్‌బాబు, ఎస్సై శ్రీకాంత్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఒక కర్ర లోడుతో ఉన్న ట్రాక్టర్ వెళ్లినట్లు కొందరు స్థానికులు తెలిపారని, ఆ దిశగా విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.
ముగ్గురు మిలీషియా
సభ్యుల అరెస్టు
చర్ల, డిసెంబర్ 24: చర్లలో సోమవారం ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మడకం ఇడమా, కల్మా దేవా, మడివి రాము అనే ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మిలీషియా సభ్యులను తేలింది. ఈ ముగ్గురు బోదనెల్లి రహదారిలో పోలీసులే లక్ష్యంగా పేల్చిన మందుపాతర ఘటనలో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై రాజువర్మ తెలిపారు.