క్రైమ్/లీగల్

పూటుగా మద్యం తాగి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, డిసెంబర్ 24 : పూటుగా మద్యం తాగి సోమవారం ఉదయం సబ్బవరం - చోడవరం రోడ్డులో పోలవరపునాగేశ్వరరావు(30) అనే వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానిక పోలీసులు సోమవారం గుర్తించారు. ఆ రోడ్డులో ప్రయాణించే స్థానికులు మద్యం దుకాణాల సముదాయం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడంటూ సోమవారం ఉదయం సమాచారం అందటంతో స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించగా ఇక్కడి వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు ధ్రువీకరించారని స్థానిక ఎస్‌ఐ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. దీంతో సంఘటనా స్థలంలో మృతిని వద్ద లభించిన కాగితంపై స్థానిక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతానెంబరు ఆధారంగా దర్యాప్తుచేయగా ఆ వ్యక్తి పేరు పోలవరపు నాగేశ్వరరావు(తండ్రి ధర్మారావు)గా గుర్తించామన్నారు. చోడవరం మండలం ద్వారకానగర్‌కు చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వాడుగా వండ్రంగం పనిచేస్తూ ఉంటాడని, మృతి తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు గుర్తించామన్నారు. ఈమేరకు అనుమానాస్పద మృతి కేసుగానమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.