క్రైమ్/లీగల్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మార్చి 12: అవనిగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఎసీబీ అధికారులు నిర్వహించిన దాడులు కలకలం సృష్టించాయి. ఎసీబీ డీజీపీ ఆర్‌పి ఠాగూర్ ఆదేశాల మేరకు సీఐలు కృపానందం, వెంకటేశ్వర్లు, విబి ప్రసాద్, హరికృష్ణలతో కూడిన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కకురాని రూ.లక్షా 29వేల 480 నగదును స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా మధ్యాహ్నం నుండి కంప్యూటర్ల ఆపరేషన్ నిలుపుదల చేసి ఎసీబీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్‌ను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.