క్రైమ్/లీగల్

కూతురిపై కత్తితో కన్న తండ్రి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 28: రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కన్నతండ్రి, కూతురు వేరొక కులం యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించి శుక్రవారం కత్తితో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని నరసింగరావుపేటలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు కన్నతండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావు పేటకు చెందిన సిద్దయ్య కుమార్తె దేవసేన గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన జావిద్ అనే యువకుడు ఎస్వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 3వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు తండ్రి కుమార్తెను హెచ్చరించాడు. కానీ ఆమె పెడచెవిన పెట్టి ప్రియుడితో తన ఇంట్లోనే ఉండగా సమయానికి తండ్రి రావడంతో ప్రేమికుడు పరారయ్యాడు. దీంతో ఆగ్రహించిన సిద్దయ్య కత్తి తీసుకుని కుమార్తెపై దాడి చేశాడు. అనంతరం చరవాణి ద్వారా ప్రియుడికి సమాచారం ఇవ్వడంతో గాయపడిన ప్రేమికురాలిని ప్రియుడు, తన స్నేహితుల సహకారంతో గూడూరు ఏరియా ఆసుప్రతికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసి దేవసేనకు తలపై 8కుట్లు వేశారు. అనంతరం ప్రథమ చికిత్స చేయించుకుని ప్రియుడితో కలిసి గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో తండ్రిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై హుస్సేన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము మేజర్లమని కొంతకాలంగా జావిద్‌ను ప్రేమిస్తున్నానని అయితే తమకు పెళ్లి చేయాలని తండ్రికి ఎంత నచ్చచెప్పినా వినలేదన్నారు. ఈ విషయంపై ప్రియుడితో చర్చించడానికి ఇంటికి రమ్మనడంతో కాపుకాసిన తన తండ్రి తనపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని తెలిపింది.