క్రైమ్/లీగల్

తిరుమలలో కిడ్నాప్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 28: తిరుమల పుణ్యక్షేత్రంలో మరోమారు కిడ్నాప్ కలకలం రేపింది. భక్తులు బసచేసే మాధవనిలయం సముదాయం వద్ద తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న 16 నెలల బిడ్డను అపరిచితుడు శుక్రవారం కిడ్నాప్‌చేసి తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. తలకు టోపీ ధరించి తెల్లచొక్కా నల్లఫ్యాంటు వేసుకున్న సుమారు 45 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఎర్రచొక్కా వేసుకున్న బాలుడిని ఎత్తుకుపోతుండటాన్ని గుర్తించారు. వెంటనే సీసీ ఫుటేజ్‌ల ద్వారా సేకరించిన నిందితుడి ఫొటోతో పాటు కిడ్నాప్‌కు గురైన బాలుడి ఫొటోతో కరపత్రాన్ని విడుదల చేసిన పోలీసులు తిరుమలలో విస్తృతంగా పంచిపెట్టారు. తిరుపతి రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద కూడా సమాచారం అందించారు.
వివరాలిలావున్నాయి. మహారాష్ట్ర లాథూర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ జి జాదవ్, ఆషాటవున్ అనే దంపతులు తమ కుమారుడు వీరేష్ (16నెలలు)తో కలిసి శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు వచ్చారు. స్థానిక మాధవ నిలయం వద్ద బసచేశారు. ఉదయం 6 నుంచి 7.45 గంటలలోపు పీఎసీ 2 (మాధవనిలయం) వద్ద తల్లిదండ్రుల వద్ద ఉన్న వీరేష్ అనే చిన్నారిని అపరిచితుడు ఎత్తుకొని నింపాదిగా వెళ్లిపోయాడు. నిద్రలేచిన అనంతరం తల్లిదండ్రులు బిడ్డలేకపోవడాన్ని గుర్తించారు.
పరిసర ప్రాంతాల్లో గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడితో కూడిన కిడ్నాప్‌కు గురైన బాలుడు ఉన్న కరపత్రాలను విడుదలచేశారు. ఎవరు వీరిని గుర్తించినా టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ 9494868480, ల్యాండ్‌నెంబర్ 0877-2289031 లేదా వన్ టౌన్ సీఐ 9440796769, డీఎస్పీ 9440796768 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.