క్రైమ్/లీగల్

తగ్గు ముఖం పట్టిన నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉన్న కృష్ణా జిల్లాలో నేరాలు తగ్గు ముఖం పడుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా చూస్తే ఈ సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫ్రెండ్లీ పోలీస్ నినాదంతో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేరాలను అదుపు చేయడంలో సఫలీకృతులయ్యారు. గత ఏడాది, ఈ ఏడాది గణాంకాలను ఓసారి పరిశీలిస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగారు. అత్యాచారాలను అదుపు చేయడంలో కూడా కొంత ప్రగతి సాధించారనే చెప్పాలి. గత యేడాది వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 3వేల 569 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 2వేల 935 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 35 హత్య కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం అదనంగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఆరుగా నమోదైన బందిపోటు దొంగతనాలు ఈ ఏడాది ఎనిమిదికి చేరాయి. అలాగే కిడ్నాప్ కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది 62 నమోదు కాగా ఈ ఏడాది 68 నమోదయ్యాయి. వివిధ చోరీ కేసులకు సంబంధించి 59.97 శాతం మేర రికవరీ సాధించారు. గత ఏడాది 52.12 శాతం రికవరీ జరిగింది. ఈ సంవత్సరం రూ.కోటి 91లక్షల 96వేల 552లు చోరీ సొత్తును రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత ఏడాది 1233 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 957 కేసులు నమోదయ్యాయి. ఇందులో 309 మంది మృత్యువాత పడగా 1272 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాల మరణాలు అత్యధికంగా జాతీయ రహదారులపై జరగడం విశేషం. గత ఏడాది రోడ్డు ప్రమాదాల మరణాలు 406, క్షతగాత్రులు 1641 ఉండటం విశేషం. మోటారు వెహికల్ యాక్ట్ కింద 2016వ సంవత్సరంలో లక్షా 26వేల 531 కేసులు నమోదు చేయగా రూ.రూ.2.82కోట్లు జరిమానా విధించారు. 2017వ సంవత్సరంలో లక్షా 54వేల 877 కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు జరిమానా విదించారు. ప్రస్తుత సంవత్సరానికి వస్తే 2లక్షల 3వేల 239 కేసులు నమోదు చేయగా రూ.4.28కోట్ల మేర వాహనదారుల నుండి జరిమానా రూపంలో వసూలు చేశారు. జాతీయ రహదార్లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను స్పీడ్ గన్‌ల ద్వారా కళ్లెం వేశారు. ప్రధానంగా నందిగామ, నూజివీడు సబ్ డివిజన్‌లలో ఈ సంవత్సరం ఆగస్టు నుండి స్పీడ్ గన్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చి మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ ఐదు నెలల కాలంలోనే 1658 కేసులను నమోదు చేసి ఆర్టీఎ అధికారులకు పంపారు. 1528 సీసీ కెమెరాలు, 32 పీటీ జడ్ సీసీ కెమెరాలతో జిల్లాను నిఘా నీడలోకి తీసుకువచ్చారు. ఇందు కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతిక్షణం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ సాగిస్తున్నారు. అలాగే దొంగతనాలను అరికట్టేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను తెర మీదకు తీసుకు వచ్చారు. ప్రత్యేకమైన యాప్ అయిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను 11వేల 722 మంది రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం. ఇందులో 999 మంది తమ ఇళ్లకు సీసీ కెమెరాల భద్రత కావాలని పోలీసు శాఖను కోరగా 899 ఇళ్లకు పోలీసులు భద్రత కల్పించారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లాకు వచ్చిన తర్వాత ప్రజలు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసు శాఖ దృష్టికి తీసుకు వచ్చేందుకు గాను వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. 9182990135 వాట్సాప్ నెంబర్ ద్వారా వచ్చిన 1602 ఫిర్యాదులను పరిష్కరించారు. ఇకపోతే డయల్ 100 ద్వారా కూడా ప్రజలకు బాసటగా నిలిచారు. గతంలో డయల్ 100కు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుండి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరేది. కానీ గత ఏప్రిల్ నెలలో జిల్లా పోలీసు కార్యాలయం నుండే డయల్ 100 ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. 5లక్షల ఒక వెయ్యి 599 ఫోన్ కాల్స్ డయల్ 100కు రాగా 1448 కాల్స్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
ప్రజాసహకారంతోనే నేరాల నియంత్రణ: ఎస్పీ
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణలో సత్ఫలితాలు సాధించినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియచేశారు. అవగాహనతోనే నేరాలను నియంత్రించగలమని భావించి ఆ దిశగా తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.