క్రైమ్/లీగల్

ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, జనవరి 1:మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు..నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది యువకులు మోటారుసైకిల్స్ నడుపుతూ ప్రధాన రోడ్లవెంబడి గొడవ చేస్తుండగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గొడవ చేయవద్దని వారించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ఒక వర్గంపై మరో వర్గానికి చెందిన యువకులు రాళ్లు, పగిలిన సీసాలతో దాడిచేసుకున్నారని తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. వీరిని చీరాల ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘర్షణ సంఘటనను తెలుసుకున్న పోలీసు సిబ్బంది సంఘటనాస్ధలానికి చేరుకుని ఇరువర్గాల పెద్దలతో మాట్లాడి గొడవలు సద్దుమణిగించారు. షేక్ బాజివలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో గొడవ జరగకుండా పోలీసులు ఉన్నారు.