క్రైమ్/లీగల్

రైల్లో నుండి మహిళను తోసిన నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 2: ధర్మవరం పరిధిలో డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైల్లో నుండి నిండు గర్భిణిను కిందకు తోసి, ఆమె దగ్గర నుండి బంగారు నగలు దోచుకున్న ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 15 రోజుల్లో కేసును ఛేదించి ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని రైల్వే ఎస్పీ సిద్దార్థ కౌశల్ పేర్కొన్నారు. ఈమేరకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కోదండరామ కల్యాణ మండపంలో బుధవారం విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను రైల్వే ఎస్పీ వెల్లడించారు. ముద్దాయి వేలాయుధం రాజేంద్రన్ (37) తమిళనాడులోని తిరువిర్కాడుకు చెందిన వాడు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని సైఫుల్లా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రాజేంద్రన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయి రెండేళ్ల నుండి జిల్లా పరిధిలో వివిధ ప్రదేశాలలో రైల్వే దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. గతంలో చెన్నైలో వివిధ ప్రాంతాలలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడి, అక్కడి పోలీసులు పట్టుకుంటారని తన దృష్టిని రాష్ట్రం వైపు మళ్లించాడు. వివిధ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఈక్రమంలో గత డిసెంబర్ 18వ తేదీన తెల్లవారుజామున 5.30 - 6.00గంల మధ్యలో కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో శిరీషా అనే వివాహితను చంపి దోపిడీ చేయాలని ప్రయత్నించాడని, రైల్వే సిబ్బంది తక్షణం స్పందించడంతో ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. చివరగా అదే రైలులో అదే బోగీలో కాపుకాచి ఉదయం సుమారు 6.00 - 6.30 గం.ల మధ్యలో బీ-1 బోగీలో ప్రయాణిస్తున్న దివ్యశ్రీ అనే ఏడు నెలల గర్భిణిని గొల్లపల్లి రైల్వే గేటు సమీపంలో నెట్టివేశాడు. ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా సుమారు 50 మీటర్ల దూరం వరకు ఆమెను లాక్కొని వెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుని వెళ్లాడు. దొంగిలించిన నగలను చెన్నైలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టినట్లు తెలిపాడు. నిందితుడు నుండి దివ్యశ్రీ నుండి లాక్కొన్న బంగారు ఉంగరం, రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడుపై నేరాలన్నీ రైలు బోగీ తలుపుల వద్ద కాపుకాచి వాష్‌రూమ్‌కు వచ్చే మహిళలపై దాడి చేసేవాడు. నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న రైల్వే పోలీసులను ఎస్పీ అభినందించారు.