క్రైమ్/లీగల్

పందులు,కుక్కల దాడిలో శిశువు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జనవరి 18: విజయనగరం జిల్లా నెల్లిమర్ల యాతవీధి ప్రాంతంలో శుక్రవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన ఆడ శిశువుని వీధి శివార్లలో గుర్తు తెలియని మాతృమూర్తి విడిచిపెట్టింది. స్థానికుల వివరాల మేరకు రామతీర్థం జంక్షన్ శ్రీనివాస థియేటర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు, పందులు విచక్షణా రహితంగా పీక్కుతినడాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు రోదన విన్న స్థానికులు అక్కడికి వెళ్లి ఆ పందులను, కుక్కలను వెళ్ళగొట్టారు. శిశువు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నాయుడు కాలనీ మీదుగా ఇద్దరు మహిళలు ఈ శిశువు వదిలి వెళ్ళారని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు ముసుగు కప్పుకుని ఉండడంతో గుర్తించలేక పోయామన్నారు. శిశువు మృతదేహాన్ని స్థానికులు చంపావతి నదిలో కననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటువంటి వారిపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.