క్రైమ్/లీగల్

రెచ్చిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జనవరి 18: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టు మిలీషియా సభ్యులు రెచ్చిపోయారు. వారపు సంతకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యాపారులను చితకబాది, వారికి చెందిన టాటా ఏస్ వాహనాన్ని దగ్ధంచేశారు. చింతూరు మండలం పేగ గ్రామంలో పట్టపగలే ఈ ఘాతుకం చోటుచేసుంది. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యాపారులు శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో జరిగే వారపు సంతకు వచ్చారు. పేగ గ్రామంలోని బస్టాండు ప్రాంగణంలో దుకాణం పెట్టి ప్రజల నుంచి అపరాలు, అటవీ ఉత్పత్తులను కొనుగోలుచేస్తున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో సమయంలో సుమారు 15మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు వ్యాపారుల వద్దకు వచ్చి మాట్లాడినట్టు తెలిసింది. ఇరువర్గాల మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ వారంతా వ్యాపారుల చేతులు కట్టి, చితకబాదారు. పక్కనే ఉన్న టాటా ఏస్ వాహనం ఇంజన్ కింద తాటాకులు పర్చి నిప్పంటించడంతో వాహనం దగ్ధమయ్యింది. అలానే వ్యాపారుల వద్ద ఉన్న రూ.30వేలు నగదు లాక్కుని అడవిలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత వ్యాపారులు భయంతో వెంటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట గ్రామానికి వెళ్లిపోయారు. చింతూరు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.