క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కొండూరు, జనవరి 19: రోడ్డు ప్రమాదంలో శనివారం ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం - జగదల్‌పూర్ జాతీయరహదారిపై మండలంలోని రామచంద్రాపురం విజయగార్డెన్ సమీపంలో తిరువూరు వైపు నుండి విజయవాడ వైపునకు వేగంగా వెళుతున్న కారు టైరు పంక్చరయంది. అదే సమయంలో రామచంద్రాపురం గ్రామానికి చెందిన చెల్లా సాంబశివరావు(35), మల్లారపు నాగేశ్వరరావు(45)లు మోటార్ బైక్‌పై చీమలపాడు వైపునకు వెళుతున్నారు. అదుపుతప్పిన కారు మోటారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమయంది. కాగా కారులో ప్రయాణిస్తున్న ఇరువురు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జె వెంకటరమణ తెలిపారు.