క్రైమ్/లీగల్

గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, జనవరి 19: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దేవిపట్నం మండలం మడిపల్లి గ్రామం వద్ద శనివారం గోదావరిలో మునిగి గల్లంతయ్యారు. యువకుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన తోట వినయ్ సంతోష్(20) అతని తల్లి కళ్యాణి, అమ్మమ్మ భవానీతోపాటు బంధువైన పిల్లా రాజీవ్ (30) కారులో శుక్రవారం దేవిపట్నం బంధువుల ఇంటికి వెళ్లారు.
శనివారం అక్కడ తిరిగిన వీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం వినయ్ సంతోష్, రాజీవ్ మడిపల్లి వద్ద గోదావరిలో స్నానం చేసేందుకు నదిలో దిగి ఈతకొడుతూ ఒక్కసారిగా గల్లంతయ్యారు. వీరితోపాటు ఉన్న వారి బంధువు సంతోష్, రాజీవ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వినయ్ సంతోష్ వైజాగ్‌లో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. పండగ సెలవులు నిమిత్తం స్వగ్రామం వచ్చాడు. అతని తండ్రి పశ్చిమగోదావరి జిల్లాలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఒక్కాగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రాజీవ్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో కాకినాడలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబం మొత్తం రాజీవ్‌పైనే ఆధారపడి ఉంది. శనివారం సాయంత్రానికి రాజీవ్ మృతదేహం లభ్యమైంది. వినయ్ సంతోష్ కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కందరాడ తరలించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

*వినయ్ సంతోష్, రాజీవ్ (ఫైల్‌పొటో )