క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, జనవరి 21: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలోని చెందిన మేడపి గ్రామం వద్ద జరిగింది. పుల్లలచెరవు మండలం అదేయగూడెంకు చెందిన మంత్రయ్య (20) త్రిపురాంతకం నుండి మోటారుసైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా మేడపి నుండి త్రిపురాంతకం వైపు వెళ్తున్న ఆటో తగిలింది. ఈ సంఘటనలో మంత్రయ్యకు గాయాలు కాగా 108 ద్వారా మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మంత్రయ్య మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

పాత కక్షలతో వ్యక్తిపై దాడి
కొమరోలు, జనవరి 21: మండలంలోని ఇడమకల్లు గ్రామంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం అర్థరాత్రి ఉలాపు వీరబ్రహ్మంపై అదేగ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో వీరబ్రహ్మంకు తీవ్ర గాయాలయ్యాయి. వీరబ్రహ్మంను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు.