క్రైమ్/లీగల్

కోళ్లను అపహరించాడని యువకుడిని చితకబాదారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 21: కోళ్లను దొంగలించాడన్న అనుమానంతో వ్యక్తిని కాళ్లూ చేతులు కట్టి వేసి విచక్షణారహితంగా చితకబాదిన అమానుష సంఘటనకు సంబంధించిన వీడియో సోషిల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పెనుమూరు మండలం ఓబయ్యగారి పల్లికి చెందిన వేణుగోపాల్ చిత్తూరు నగరంలోని చికెన్ సెంటర్‌కు కోళ్లను సరఫరా చేసే వాహనానికి డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 13న నగరానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని చిట్టి కోళ్లను దొంగలించాడన్న నెపంతో వేణుగోపాల్‌ను గదిలో నిర్బంధించాడు. తాను ఏ దొంగతనం చేయలేదని వేణుగోపాల్ చెప్పినా వినని చిట్టి, అతని అనుచరులు గదిలో వేణుగోపాల్ చేతులు కాళ్లు కట్టి వేసి కర్రతో విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి, ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పితే నీ కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారు. అయితే వేణుగోపాల్‌ను చితక బాదుతున్న సెల్ ఫోన్ దృశ్యాలు సోమవారం నగరంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో రంగలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను పలు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

చిత్రం..వేణుగోపాల్‌ను కట్టి కొడుతున్న దృశ్యం