క్రైమ్/లీగల్

గంజాయి స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జనవరి 22: చట్టవిరుద్ధంగా నిషేధిత గంజాయిని తరలిస్తు న్న ముఠా సభ్యులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్‌ల నుంచి మూడు కిలోల గంజాయి, రూ.5వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్‌పెక్టర్ బీ.రవీందర్ కథనం ప్రకారం... పాపిరెడ్డి కాలనీలోని ప్లాట్ నెంబర్ 2031లో నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రం, మెయిల్‌కర్ బీదర్, సీఎంసీ కాలనీకి చెందిన అల్లావుద్దీన్ (32), మహారాష్టల్రోని బడెలింగవ్ కల్యాణ్ జిల్లా, తిగ్బాలకు చెందిన సలీం ఇఖ్బాల్ ఖాజీ (57)లు గంజాయి సరఫరా చేస్తున్నారు. 21వ తేదీన చందానగర్‌లోని గాంధీ విగ్రహం వద్ద గంజాయిని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్టు 1985కింద మంగళవారం రిమాండుకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డీఎస్‌ఐ బాలరాజు, శ్యామ్‌కుమార్, ఏఎస్‌ఐ నర్సింహా రెడ్డి ఉన్నారు.