క్రైమ్/లీగల్

ఏడేళ్ల బాలికపై రేప్, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, జనవరి 23: తల్లిపై కనే్నసిన ఓ దుర్మార్గుడు ఆమె లొంగకపోవడంతో ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన హత్యచేశాడు. తరువాత రేపిస్టు చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. మహారాష్ట్రంలోని పూణె నగరంలోని మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ(సీఎంసీ) ప్రాంగణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. క్యాంప్‌లోని చెట్టుకు 24 ఏళ్ల యువకుడు ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. అతడే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం భర్తను కోల్పోయిన ఓ మహిళ ఏడేళ్ల చిన్నారితోకలసి కాలేజీ ప్రాంగణంలోనే ఉంటోంది. నిందితుడు కూడా అదే క్యాంపస్‌లో ఉంటున్నాడు. రెండు కుటుంబాలు సీఎంసీ సివిల్ స్ట్ఫా మెస్‌లో పనిచేస్తారు. మంగళవారం సాయంత్రం తల్లి పని నుంచి వచ్చేసరికి బాలిక అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆందోళన చెందిన ఆమె క్యాంపస్‌లోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలిక అప్పటికే చనిపోయినట్టు ధృవీకరించిన వైద్యులు అంతకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని తల్లికి చెప్పారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్ది నెలల క్రితమే తన భర్త చనిపోయాడని తల్లి విచారణలో వెల్లడించింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోమని నిందితుడు వేధిస్తున్నట్టు వాపోయింది. యువకుడి కోరికను తిరస్కరించడంతో కక్షపెంచుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ సందర్భంలో సోమవారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుందని వారన్నారు. ఆమెపై కక్షపెంచుకున్న నిందితుడు మంగళవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక మృతి వార్త సమాచారం తెలుసుకున్న పోలీసులు తొలుత అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. గాలింపుచర్యలు చేపట్టకా సీఎంసీ క్యాంప్‌స్‌లోని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. 4వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని దాపోడీలో ఉన్న సీఎంసీ అత్యంత కీలకమైంది. మిలటరీ సాంకేతిక, వ్యూహాత్మక శిక్షణ ఇక్కడ ఇస్తుంటారు. పూణె జిల్లా ఖాడ్కీ కంటోనె్మంట్ పక్కనే సీఎంసీ ఉంది