క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగళి, మార్చి 18 : మండల పరిధిలోని కరిదాసనపల్లికి చెందిన రామకృష్ణ (58) కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం తన కుమార్తెను పిలుచుకు వచ్చేందుకు కర్నాటక హందికుంటే గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తళ్లహళ్లి సమీపంలో గుర్తు తెలియని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగి అక్కకడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కర్నాటక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బెళుగుప్ప, మార్చి 18 : మండల కేంద్రం సమీపంలోని పూలవంక వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాల్(21) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన గోపాల్, తిప్పేస్వామి, బాలరాజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో బెళుగుప్పకు వచ్చి తిరిగి వెళ్తుండగా మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన సురేష్, బాస్కర్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో ఐదుగురు గాయపడ్డారు. గమణించి అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే బెళుగుప్ప ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ గోపాల్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మిగిలిన నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ నాగస్వామి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తనకల్లు, మార్చి 18: మండల పరిధిలోని గంగసానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చీకటిమానిపల్లికి చెందిన సోంపాళ్యం సత్యనారాయణ (45) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సొంత పని మీద సత్యనారాయణ కొక్కంటి క్రాస్‌కు ద్విచక్ర వాహనంలో వస్తుండగా గంగసానిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఎదురుగానే వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.