క్రైమ్/లీగల్

ద్విచక్రవాహానాలు ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, జనవరి 25: రెండు ద్విచక్రవాహాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని చిన్నరామచర్ల గ్రామంవద్ద జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నరామచర్ల గ్రామానికి చెందిన జనె్న హరిష్(24) కొన్నాళుగా ఆటోనడుపుకొంటూ హైదరాబాద్‌లో జీవిస్తున్నాడు. చిన్నరామచర్ల స్వగృహంలో జరిగిన ఓ విందు కార్యాక్రమానికి భార్యతో కలిసి వచ్చాడు. హరిష్ స్వంతపనిపై మండలకేంద్రం బచ్చన్నపేకు వస్తుండగా అదే సమయంతో గోపాలనగర్‌కు చెందిన తూర్పాటి సుధాకర్(26) ఇంట్లో ద్విచక్రవాహనం తీసి చిన్నరామచర్లరోడ్డు వైపు వెళ్లాడు. ఒకరిని ఒకరు గమనించకపోవడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘనలో బలమైన గాయలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ రెండు కుటంబాల్లో విషాదం అలుముకుంది. హరిష్‌కు 10నెలల కింద వివాహం కాగా సుధాకార్‌కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు బచ్చన్నపేట పోలీసుల కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.