క్రైమ్/లీగల్

ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, జనవరి 25: వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడడంతో చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మారుపాక దేవయ్య (55), ఇల్లంతకుంట వెంకటస్వామి (55) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింగాపూర్‌కు చెందిన టిఎస్.02.యుఎ.8461 అనే ఆటోలో వేములవాడ నుండి నర్సింగాపూర్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కుక్కన తప్పించబోగా ఆటో బోల్తాపడింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నర్సింగాపూర్‌లో విషాదం నెలకొంది.