క్రైమ్/లీగల్

ఓటమి భారంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిహత్నూర్, జనవరి 25: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూరు తాండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీచేసి ఓటమిపాలైన పవార్ కళాబాయి ఓటమి భారంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టగా ఉత్కంఠభరితంగా సాగిన లెక్కింపులో కళాబాయి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జాదవ్ సులోచన బాయికి 164 ఓట్లు రాగా నాల్గవ స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కళాబాయికి 84 ఓట్లు వచ్చాయి. ఓటమి అవమానంగా భావించిన పవార్ కళాబాయి ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కాగా సర్పంచ్ ఎన్నికల్లో కళాబాయి వరసగా రెండోసారి ఓటమి చెందడంతో ఆమె మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు.