క్రైమ్/లీగల్

భూపతేశ్వర కోనలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, మార్చి 18: మండలంలోని బీరకుప్పం పరిధిలోవున్న భూపతేశ్వర కోనలో తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కధనం మేరకు తమిళనాడుకు చెందిన 6మంది యువకులు భూపతేశ్వర కోన ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వీరిలో చెన్నయ్ ఐనవరానికి చెందిన ఆనంద్ (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమాదవశాత్తు మడుగులో పడి గల్లంతయ్యాడు. నీటిలోపడిన అతనిని రక్షించేందుకు అతని స్నేహితులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్ సత్యవేడు ఫైర్ సిబ్బందితో కలిసి మడుగులో గాలించారు. అయితే ఆనంద్ మృతదేహం ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం తిరిగి గాలింపు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎస్‌ఐ తెలిపారు.