క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జనవరి 27: మండలంలోని రాయిగిరి, కూనూరు గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న ఆటోను బైక్‌ఢీకొనడంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తులు గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన బుర్ర ధశరథ (47), అనీల్ (25). వీరు భువనగిరి వైపుకు వస్తుండగా వేగంగా వస్తున్న అటో డీకొట్టడంతో అక్కడికక్కడే మృ తి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలు కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిలొ ఒకవ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో భువనగిరి ఏరియా ఆసుపత్రి డాక్టర్లు ప్రధమ చికిత్స నిర్వహించి హుటాహుటిన గాంధి ఆసుపత్రికి తరలించారు. మృతులు తండ్రి,కొడుకులుగా గుర్తిచారు. భువనగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.