క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటపల్లిగూడూరు, మార్చి 18: మండలంలోని నరుకూరు సెంటర్‌లో కుటుంబ ఆస్తి తగాదాల కారణంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసు, స్థానికుల సమాచారం మేరకు, వేగూరు పద్మమ్మకు చాలా కాలంగా ఆస్తి తగాదాలు ఉండేవి. ఈ క్రమంలో పద్మమ్మ భర్త వెంకటరమణయ్యపై వారి సోదరుడు బలరామయ్య గతంలో నెల్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఉన్నాడు. అప్పటి నుంచి వేగూరు వెంకటరమణయ్య పరారీలో ఉన్నాడు. ఇదిలావుండగా అతని భార్య పద్మమ్మను (45) శనివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. ఆదివారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా పద్మమ్మ కుటుంబీకులైన భర్త సోదరులు బలరామయ్య, శ్రీహరి, భాస్కర్ అనుమానితులుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.