క్రైమ్/లీగల్

అడ్డగోలుగా జీవోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 29: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ప్రభుత్వం కొందరికి భారీగా లబ్ధి చేకూర్చేలా జీఓలు విడుదల చేసిందని పిటిషన్‌లో ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీబీఐ సహా మొత్తం 13మందిని ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మొత్తం తొమ్మిది జీఓలు అడ్డగోలుగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందని, వెంటనే వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ కన్నా తరపు న్యాయవాది గోశాల శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాదులు గడువు కోరగా ఫిబ్రవరి నాలుగో తేదీకి కోర్టు వాయిదా వేసింది.