క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, జనవరి 31 : పత్తిపంట దెబ్బతినటంతో మనస్తాపం చెందిన రైతు ఆదినారాయణరెడ్డి (56) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన గురువారం మండల పరిధిలోని రామరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని కుమారుడు అనంత వెంకటరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదినారాయణరెడ్డికి మూడెకరాల సొంత పొలం ఉంది. దీనికితోడు తొమ్మిదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంట సాగు కోసం దాదాపు రూ.10 లక్షలు అప్పులు చేశాడు. ఈనేపథ్యంలో పత్తిపంట దెబ్బతినటంతో మనస్తాపం చెంది మద్యంలో పురుగుల మందును కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కాగా ఆదినారాయణరెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న తహాశీల్దార్ అన్వర్‌హుసేన్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.