క్రైమ్/లీగల్

కిడారి, సివేరి హత్యకేసు నిందితులకు మార్చి ఒకటి వరకు రిమాండు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 31: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులను గురువారం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరచగా, మార్చి 1వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.
గత ఏడాది కిడారి, సివేరిలను మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితులు విశాఖపట్నం సెంట్రల్ జైలులో ప్రస్తుతం రిమాండులో ఉన్నారు.
కాగా.. రిమాండు గడువు ముగియడంతో గురువారం నిందితులు సుబ్బారావు, ఈశ్వరీ, శోభన్, కొర్ర కమల తదితరులను ఎన్‌ఐఏ అధికారులు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తరలించి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
దీంతో నిందితులకు మార్చి ఒకటో తేదీ వరకు రిమాండు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో తిరిగి విశాఖ జైలుకు తరలించారు.