క్రైమ్/లీగల్

చెరువులో ఈతకెళ్లి నలుగురు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సమీపంలోని పాయమ్మ చెరువుకు సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఒంటిపూట బడి ముగిసిన తరువాత ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి లావుడ్యా సౌజన్య(13), ఏడో తరగతి చదువుతున్న భూక్యా సిద్దూ(12), తొమ్మిదో తరగతి విద్యార్థి బాణోత్ సంతోష్(14), ఎనిమిదో తరగతి చదువుతున్న బాణోత్ దిలీప్(12) చెరువులో మునిగి అక్కడికక్కడే మృతిచెందారు. గొర్రెల కాపారులు మధ్యాహ్నం ఈ సమాచారం తెలియజేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు, గ్రామస్థులు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.