క్రైమ్/లీగల్

కృష్ణానదిలో మునిగిన బల్లకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, ఫిబ్రవరి 5: మండలంలోని రామన్నపేట నుండి గుంటూరు జిల్లా అచ్చంపేట మధ్య తిరిగే బల్లకట్టు మంగళవారం నది ఒడ్డునే కృష్ణానదిలో మునిగింది. ఒక లారీ, రెండు ఆటోలు నదిలో మునిగిపోయాయి. ఆ సమయంలో 20మంది ప్రయాణీకులు ఉన్నారు. బల్లకట్టు బయలుదేరకముందే నది ఒడ్డునే నీటిలోకి వరిగి పోవడంతో ప్రయాణీకులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణీకులు అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.