క్రైమ్/లీగల్

జగన్‌పై హత్యాయత్నం కేసు.. నిందితుడికి రిమాండు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 8: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు ఈనెల 22వ తేదీ వరకు రిమాండు పొడిగించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు రిమాండు ముగియడంతో అతన్ని ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో రిమాండు గడువు పొడిగిస్తూ జడ్జి ఆదేశించడంతో తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలావుండగా నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలంటూ అతని తరుఫు న్యాయవాది కోర్టులో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు బెయల్ పిటిషన్ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్టు వారు ఆశాభావంతో ఉన్నారని సమాచారం.