క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, ఫిబ్రవరి 14: మండల పరిధిలోని భావదేవరపల్లిలో గురువారం విద్యుదాఘాతంతో విజయవాడకు చెందిన అప్పల నరసింహారావు (59) మరణించారని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. భావదేవరపల్లిలో రామిశెట్టి సతీష్ కుమార్‌కు చెందిన రొయ్యల చెరువులకు లారీలో చినగంజాం నుంచి తెచ్చిన ఉప్పు బస్తాలను దించేందుకు లారీకి కట్టి ఉన్న మోకును ఊడ తీస్తుండగా అది ప్రమాదవశాత్తు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నరసింహారావు మృతదేహాన్ని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి శవ పంచనామా నిమిత్తం పంపామని, ఈ మేరకుకేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.